19, మార్చి 2014, బుధవారం

గ్రీష్మం....


శిశిరం లో మోడుగా మారిన కొమ్మలన్నీ....వసంతుని ఆగమనంతో
చిగురులు తొడిగి....ప్రకృతి కన్యకు....పచ్చని చీర కట్టాయి...
మావి చిగురులు మేసిన కోయిలలు గొంతు సవరించుకొని ...
కుహు...కుహు..ల రావాలతో....కమ్మని గానామృతాన్ని పంచుతున్నాయి..

కరిగిన హిమంలోని చల్లదనం ...వచ్చే గ్రీష్మంలోని వెచ్చదనం
కలబోసుకొని నులివెచ్చని పొత్తిళ్ళను గుర్తుచేస్తున్నాయి....
రేరాజు కురిపించే వెన్నెలను పోటీ చేస్తూ...
తీగేలనిండా...విరగబూసిన మల్లెలు పరిమళాలతో మత్తెక్కిస్తున్నాయి..
చైత్ర వైశాఖ మాసాలలో ...మామిడి కాయల తోరణాలగుత్తులు ..
జేష్ఠ ఆషాడ మాసాల గ్రీష్మ ఋతువుకు స్వాగతం పలుకుతూ...
పచ్చని పుచ్చకాయలు ఎర్రని గుజ్జుతో...చల్లగా సేద తీరుస్తానంటూ..
వీది వీదిన చెరుకు బండ్లు ...తీయని అమృత రసాన్ని అందిస్తూ....
బాబోయ్...ఎం ఎండ!!అనుకుంటూనే..ఐస్క్రీం తింటూ ఆనందించే కాలమిదే..
"రోహిణి కార్తి లో రోళ్ళు పగులుతాయట..." నానుడిని గుర్తు చేసుకుంటూ...
రోడ్డు మీద ఆమ్లెట్ వేసే ఆంకర్ని ని టివిలోచూస్తూ.."నిజమే..!" అనుకుంటాం..
బడుల సెలవులు....పిల్లల అల్లరులు....ముచ్చటలే..పని వత్తిళ్ళయినా..
పదినెలల కాలం ఎదురుచూపులతీరం....బంగినపల్లి మామిడిపండ్ల రుచులే...
వచ్చే వర్షఋతువుకై..భానుడు తనప్రభావంతో సముద్రజలాలను ఆవిరిచేస్తూ!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి