3, మార్చి 2014, సోమవారం

మన ప్రభుత్వం...

అహింసని ఆయుధంగా
చేసుకొని స్వరాజ్యాన్ని
తీసుకొచ్చారు బాపూజీ....!!...

హింసనే..ఉపయోగించి...
ఓట్లు వేయించుకొంటున్నారు...
మన బడా నాయకులు....!!

ప్రజాస్వామ్యం...
ప్రజల కందని భాగ్యమైంది...
స్వార్ధ రక్కసి కోరలలో..
చిక్కుని..కొనఊపిరితో కొట్టుకుంటుంది...

ఉచిత భోజనం, ఉచిత విద్య,
ఉచిత కరెంటు పథకాలు
ఉన్నోడి గోధాముల గోనెసంచుల్లో
డబ్బై...మూలుగుతున్నాయి...

ప్రాంతీయ తత్వం ప్రచండమై...
నీది నీకె..నాది నాకే...
నానుడి నిలబడింది...

సమాధానాల సమూహం (అసెంబ్లీ)
మాయమై...
రంకేలేసే...
రాబందులకు (రాజకీయనాయకులు) నెలవైంది....

ఐకమత్యం చెదిరి...
నిందల రాజకీయం
పైశాచిక నృత్యం చేస్తుంది..పార్లమెంటు పరితాపంతో....
మౌన భాష్పాలు రాలుస్తుంది....

మూడు వన్నెల
రెపరెపలమూగరోదనలో....
అశోకచక్రం
రంగు వెలిసిపోయింది...
న్యాయం
నాలుగు సింహలకాహారమయింది...!!
ఇదే..మన ప్రభుత్వం..మరి!!ి!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి