19, మార్చి 2014, బుధవారం

రాధా కృష్ణుడవై ....

శేష శయనుడవై సేదతీరూ...శ్రీలక్ష్మి సేవలందుకుంటున్న విష్నుమూర్తీవే.. ...
దేవకి గర్బాన అష్టమినాడు జన్మించి ...వసుదేవునెంట యదుకులానికి వలసపోయి
యశోధమ్మ చిన్ని కృష్ణుడవై.....అల్లారు ముద్దు కన్నయ్యవయినావే.. !!

మట్టి తింటున్నావని బ్రమసిన ఆ తల్లికి ముల్లోకాలను...చిన్నినోట చూపి
అండపిండ బ్రహ్మాండాలలో నీవే ఉన్నావని చాటుతూ....వెన్నను దొంగలించి
నిదురించె గోపెమ్మెల పెదవులకు పూసి...వారి తగవులకు కారణమైనావే..!!
ఇదేమిచోద్యమ్మన్నా! కోపించిన యశోద నిను రొటికి బందించ...
బారెడు చెట్లను కూల్చి... గంధర్వుల శాపవిమోచన గావించి
గోవులగాస్స్తూ....మురళి చేతబట్టిన గోపన్నవయినావే..!!
శిఖను పించము దరించిన శిఖిపించమౌళి..
జలకాలాడు కన్నెల చేరెలెత్తుకెళ్ళి..
జవాబుగా వారి జీవితాలకానందమునొసగిన హృదయచోరుడివైనావే..!!
మేనమామయిన కంశుని వధించి తల్లితండ్రుల చెరవిడిపించి
బృందావని చేరి యమున తరగల పాదాలిడి పావనమొనరించి
రాధచెలిమిని పంచుకొంటూ..ఆరాధనలభాగమై రాధాకృష్ణుడవైనావే..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి