5, మార్చి 2014, బుధవారం

భవితను ...

భరతావనిలో భాగ్యమంతా..మన తెలుగు వారి సొంతం....
శ్రీనాధుని భాగవతమ్....అన్నమయ్య కీర్తనలు...
కృష్ణదేవరాయ అష్టదిగ్గజాలు...రామదాసుని రమ్య ఆలాపనలు.......
అంధ్రప్రదేశ్ అమ్మ ప్రసవించిన మణి మాణిక్యాలు...

భాషలో యాసల మార్పులు...అవి తెలుగు లోని సొగసులు...
బావాలు పలికించే ....మారని అర్ధాలు....
మల్లెల సౌరభాలు....మావిళ్ళ ఆస్వాధనలు ....
అనుభూతించటంలోనే ఉన్నాయి ఎనలేని మాధుర్యాలు....

అమ్మకోసం ఆరాట పడుతూ....ఆంద్రా తెలంగాణీయులు...
సోదరభావంతో ..పంచుకున్నా... అమ్మ నేర్పిన సంస్కృతి ఒక్కటే...
అమ్మ పెట్టె....ఆవకాయ ...రాగి సంకటి....ఒకటే...
దూరాలు పెరిగినా ...దగ్గరతనాల అనుభందాలు ఒకటే....

జ్ఞాన సరస్వతి పాదాలు కడిగిన గోదావరమ్మ...
రామ ధ్యానంలో శ్థబ్ధమయినా.....పాపికొండల దాటి
అంతర్వేదిలోని సంద్రంలో...కలసినట్లు.....
ప్రకృతినే...కాదు....పరిస్థితిని సామరస్యంతో కాపాడుకుందాం....!!

జై...సీమాంద్ర ....జై ...తెలంగాణా....నినాదాలు...
వివాదాలు కాకుండా...బేదాలు లేని భవితను పేర్చుకుందాము....!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి