మాధవా....
పిల్లన గ్రోవిని ఊదగా...
మాధవా....
తమని తాము
మరచినారు గోపికలు
చిలికే కవ్వము నొదిలేసి కొందరు
అత్తమామల సేవను విడిచి ఇంకొందరు
మగని కౌగిలి విడిపించుకొని మరికొందరు
పరవశమొంది తమని తాము
మరచినారు గోపికలు
మాధవా.....
యమున తరగల నురగలో
పదాలు కదుపుతూ
పొన్న చెట్టు నీడలో
సేదతీరుతుంటివే....
కానీ....
ప్రతీ భామ కౌగిలిలో చేరి
సైయాట లాడుచుంటివి
పదహారువేల గోపికలతో....
ఈ రాసక్రీడల సుందర ద్రుశ్యము
మదిని గాంచిన నేను
ధన్యత నొదితి
మాధవా.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి