29, జూన్ 2014, ఆదివారం

శునక రాజాలు

'కుక్క చావు చస్తావు ' అని అంటారు......
కాని ఆ కుక్కకు దొరికిన అదృష్టం ఎవరికి దొరుకుంది..
ధర్మానికి కట్టుబడిన జన్మ కనుక ...
ధర్మరాజుతో పాటు స్వర్గానికి వెళ్ళింది...

సాయి బాబాగారి ప్రేమకి పాత్రురాలై ..
తన బ్రతుకుకు సార్ధకత చేకూర్చుకుంది.
అయన ఆత్మను తనలో నిలుపుకొని
తాను పరమాత్మ స్వరూపంగా మెలిగింది..
దత్త ప్రభువు చెంతనున్న నాలుగు కుక్కలు..
నాలుగు వేదాలకు రూపాలై..
భరతావనికి మార్గదర్శకాలుగా నిలిచి ..
పురాణాలలో చిరస్థాయిని పొందాయి....
పోలీసు వాళ్ళకు వాసన కనిపెట్టే డిటెక్టివ్లయి
నేరాలు చేసిన వాళ్ళను పట్టించేందుకు
అవసర పడుతూ యమ దూతలవలె ముందుకురుకుతాయి
మరి కుక్కలని చిన్నచూపు మాని..శునక రాజాలకి ప్రేమని పంచుదాం..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి