10, అక్టోబర్ 2016, సోమవారం

మా తాత చెప్పేవారు.........
పైన ఏడేడు లోకాలుంటాయని...
స్వర్గం చివరిదని...
అక్కడ...దేవతలుంటారని..
చిన్ని కళ్ళ ల్లో ఎన్నెన్ని కలలో...
ఆ లోకాల చేరుకోవాలని...
ఆ దేవలోకంలో...
నేను ఓ దేవత గా తిరుగాడాలనీ..
కొలనులో మిల మిల మెరిసే....
వాడని స్వర్ణ పుష్పాలని సృసించాలనీ...
తీగె మల్లెల ఊయలలో ఊగుతూ
పెరగని బాల్యంలోనే....చిరంజీవినవ్వాలనీ...
కళ్ళు తెరిచే సరికి..బాల్యం దాటి పోయింది...
ఆశల నిచ్చెన కూలిపోయింది..
మబ్బులు మాత్రం మిగిలాయి...
తాతని తనలో కలుపుకొని...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి