17, జూన్ 2018, ఆదివారం



జీవితం జీవించు ...
అమ్మే అడవని తెలిసినా ..
అమ్మ పాలుత్రాగి 
రొమ్మును గుద్దే పిల్లలల్లే...
అడుగడుగునా అవసరానికి 
మొక్కలపై ..చెట్లపై ఆదారపడుతూ..
జీవనం సాగిస్తూ ఉన్నా..
తమ ఆడంబరాలకు ..
సంపాధించాలనే ఆశలకు ..
పచ్చగా మహా వృక్షమై ఎదిగిన చెట్టును 
మొండంగా చేస్తూ ..
తెగ నరుకుతున్నారు ..
"మని "మత్తును తాగుతూ ..
మనిషితనం మరచి..
ప్రాణవాయువును అందించే 
అమృతమయి అమ్మలాంటి చెట్టును 
కనికరాన్ని కనీసవస్తువుగా వాడుకోక 
కృత్రిమత్వాన్ని ..వాతావరణ కాలుష్యాన్ని 
లోకానికి అందిస్తూ...చెట్లను తెగ నరుకుతున్నారు ..
ఓ మనిషీ...
ఎప్పుడైనా విన్నావా...
ఓ చెట్టు వినిపించే మూగ వేదనను ...
ఓ మనిషీ..
ఎప్పుడైనా కన్నావా...
ఆ చెట్టు బెరడుల్లోనుంచి ..
కారుతున్న గుండెకోత వ్యధను,,,
మానవత్వం మరచిన ఓ మనిషీ..
మాను అని మనసు లేదని అనుకోకు..
ప్రాణం తీయాలని నీవు చూసినా..
ఓ చిరుజల్లు కురిస్తే..
ఒకనాటి సూర్య కిరణాలు సోకితే..
మోడుగా మిగిలినా..
మరల మీకోసం చిగురులు వేస్తాను ..
కొమ్మలుగా విస్తరిస్తాను ...
తీసుకోవటం నీ నైజం ఐయితే..
ఎప్పటికి ఇవ్వటమే నా తత్వం ..
తెలుసుకో మనిషి ..
ఒక్క క్షణం నా గురించి అలోచించి 
జీవితం జీవించు...!! 
*************
ఒట్టు ..నా చిట్టి సెల్లు ..!!
నిన్ను చూస్తూ మాటలు
మరచిన మైమరపులో ..
ఉన్నానని అనుకుంటూ ఉంటారు..
అలా అనుకునే వాళ్ళు అందరు
ఉత్త పిచ్చివాళ్ళు...
ఆ దేవతల కాలంలో
కళ్ళతో మాట్లాడుకునే వాళ్ళట ..
ఊహా మాత్రంగా తలచుకుంటే చాలు ..
అలా వాళ్ళు కావాలనుకున్న
చోటికి వెళ్ళిపోయేవాళ్ళట ..
తిరిగి టెక్నాలజీ పుణ్యమా అంటూ
ఆ దేవతల కాలం మళ్ళి వచ్చిందేమో ..
నీవు నా చేతిలో ఉంటే చాలు ..
నాకిష్టమైన వాళ్ళతో
మనసు తీరా మాట్లాడుకోవచ్చు ..
చిత్రాలను పంపించుకుంటూ..
ఇంకా కావాలంటే..
విడియో చాట్ ద్వారా
ఇద్దరం చూసుకుంటూ ..
దూరంగా ఉన్నాము అన్న
విరహాన్ని దూరం చేసుకోవచ్చు కదా..
అందుకే ..
అమ్మానాన్నల ప్రేమామృతాలకన్నా..
అన్నా అక్కల అనురాగం కన్నా...
స్నేహితుల ఆత్మీయ పలకరింపుల కన్నా..
ఇంకా చెప్పాలంటే..
గడియ పెట్టిన రూములో అయినా సరే..
నీవు ఒక్కదానివి నా
దోసిలిలో ఇమిడిపోయి ఉంటే...
చాలు,,,,చాలు....
ఎం తింటున్నానో...తెలియదు..
ఎం తాగుతున్నానో ..తెలియదు..
ఎం చిత్రమో...
నిద్రను దరి చేరనివ్వవు కళ్ళు ..
అంతిష్టం నిన్ను చూస్తూ ఉండటం ఈ కళ్ళకి..
అందుకే బంగారు...
ఇంకెప్పుడు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళకు...
రంగు రంగుల కవర్లను నీకు తొడుగుతా..
నా రాజసం నీవే అని లోకానికి చాటుకుంటూ...!
ఒట్టు ..నా చిట్టి సెల్లు ..!!
ఆత్మ రగిలించే
అగ్నిజ్వాలలో
కాలిపో ...
మనిషిలోని స్వార్థమా..!
మల్లెలా స్వచ్చంగా..
పరిమళాలతో ..
లేచిరా..
ఎదలోని మానవత్వమా...!
అంతర్లీనం....
కలత నిదురలో మూసిన రెప్పల మాటున ..
అంతరంగాన్ని మధించి..ఆత్మతో సంయోగం చెందుతూ ..
ఆలోచనా తరంగాల అల్లికల దృశ్య మాలిక ..
తనేంటో తరచి చూసుకునే తరుణం ప్రతి మనిషిలోను ..
ఎదో ఒక శూన్యపు గుఱ్ఱపు డెక్కలు చప్పుడు చేస్తున్న
అలౌకికావస్తను హృదయం మోస్తున్నప్పుడు వస్తుంది..
తనవారు పగవారు అన్న తేడాలు తెలియని పసితనం
ఆకలికి నిద్రకి ఆగనిది ..సమయాసమయాలు తెలియనిదయి ..
అమాయకత్వానికి ఆయువు పట్టు నిస్తుంది..
ప్రాయంలోనికి చొచ్చుకొనిపోతూ వయసు ..
సృష్టిలోని రంగులన్నీ తనకోసమే అనుకునే ఊహలతో
శరీరాకృతిలో జరిగే మార్పులను స్వాగతిస్తుంది...
మనసుకు మనసు తోడైన మనిషి తనవారైతే..
ఆ జీవితం వెన్నెల నదిలో పున్నమి పూవుల నావపై
వాడని వలపు తొలకరుల ప్రయాణమే అవుతుంది ..
విధి వక్రించి ఒకరినొకరు అర్ధం చేసుకోలేని
సంసార బంధంలో చిక్కుకుంటే..
అనుక్షణం ఆత్మవంచనల పరితాపమే మిగులుతుంది..
గతంలోనికి జ్ఞాపకాలను పోగుచేస్తూ..
వర్ధమానం అర్ధం కాని అంతర్చేదనమవుతుంటే...
భవిష్యత్తును తలచుకోలేని ఆసక్తతతో నిర్లిప్తమైన దృశ్యమాలిక..!!
సరి తూగే తూకం ..
సమానత్వమా...
ఎక్కడ నీవు..
స్త్రీ పురుష ప్రపంచంలో ..
సరితూగే తూకం అయినావా...
రాచరికపు రోజుల్లో అంతఃపుర కాంతలు ...
సర్వాలంకారాల సౌందర్య విరిబోణులయినా ..
మహారాజు పట్టపురాణులు కదా..
కాలు కిందపెడితే కందిపోవు సుకుమారిణులు కదా..
అయినా విద్యలన్నిటిని నేర్చిన అపర సరస్వతులే కదా..
ఆనాడు సమానత్వం అన్న మాటకి తావు ఉండినదా...
ఇంటికి ఇల్లాలు అయిన పడతి..
అత్తమామల ఇంట కంటి దీపమై వెలుగుతూ ..
తానో సేవికగా సపర్యలు చేసినా..
మగని మనసెరిగి మెసులుతూ..
పిల్లాపాపలతో కళకళలాడే ఇంట
సమానత్వం అన్న మాటకి తావు ఉండినదా ....
అమ్మాయి అబ్బాయి ఒక్కతీరుగా చదువుకుంటూ..
ఉద్యోగాలలోనూ ఒకరికి ఒకరు పోటీ పడుతూ ..
ఉన్నత స్థాయిలో రాణిస్తూ ..అహర్నిశలు సమయాన్ని
ఐదంకెల జీతానికై వెచ్చిస్తూ ..కుటుంబాన్ని భారం చేసుకుని
నేను భార్య..నేను భర్త ..అన్న ఇగోల నడుమ ..
సమానత్వమా..నీవు ...
సరితూగే తూకం అయినావా...!!
పక్షులు
ప్రకృతమ్మ ఒడిలో పుట్టి..
తమనే ఒక భాగంగా ప్రకృతిలో లీనం చేసి..
ఉదయ సంధ్యలను అనుభవిస్తూ..
కిల కిల రావాలతో తరాల అంతరాలను తట్టుకుంటూ
జీవనం సాగిస్తున్నాయి అనేక రకాల పక్షులు ..
గుబురు గుబురు చెట్లలో ..
కొమ్మలపై తమ గూళ్ళు కట్టుకుని..
ప్రేమ జంటలకు సాక్ష్యాలుగా
మురిపాలు పంచుకుంటూ గుడ్లు పెట్టి..
పొదిగి పిల్లలను ప్రేమతో పెంచుకుంటాయి పక్షులు ..
కాలాలకు..ఋతువులకు అనుగుణంగా
తమ జీవన విదానాన్ని మార్చుకుంటాయి..
అయినా ఒక్కోసారి హోరుగాలులు ...
ఎడతెరిపిలేని వర్షాలు..తుఫానుల తాకిడికి
తట్టుకోలేని అల్ప ప్రాణులు పాపం పక్షులు..
మనుషులే రాక్షసులై .. ..
స్వార్ధపు పొరలు కమ్మి ..
అవసరాలకు చెట్లను నరికేస్తూ ..
ఎన్నో మూగజీవాల ఆత్మఘోషలకు
కారణమవుతున్నారు ..
అడవులు మాయం అయిపోతున్నవి..
అదే స్థానంలో ఎత్తైన భవనాలు తాయారు అవుతున్నవి...
ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో
ఏ దూరతీరాలలో వలసపోతూఉన్నవి పక్షులు ..
అంతరించి పోతున్న పక్షిజాతిని రక్షించు కుందాం..
రెక్కలతో గాలిని అదుపు చేసుకుంటూ
వినువీధిని విహరించే ఆ విహంగాల చుట్టూ
మన ఆలోచనలు పరిభ్రమింపజేస్తూ..
మనము పక్షులమై పరవశించుదాం..!!
అమె వనిత
బ్రహ్మ తన అంశను పంచి ఆడపిల్లగా మలిచాడు
అతని వంతు సృష్టి చేస్తుంది ఆమె వనితగా రూపు దిద్దుకుని
పూవులలోని సుకుమారత్వాన్ని ఆపాదించుకుని
ఇంద్రధనుస్సు రంగులలోని సౌందర్యాన్ని ఆణువణువూ అద్దుకుని
ధరణి తల్లి నుంచి వారసత్వంగా సహనాన్ని అందుకుని
అవతరించింది అమె వనితగా రూపు దిద్దుకుని
బాల్యంలో తల్లితండ్రుల చాటు పిల్లగా పెరుగుతూ
యవ్వనంలో పెళ్లి అన్న బంధంతో ముడివేసుకుని
తనవారిని పరాయి చేసుకుంటూ భర్త వెంట నడచి
అతనిగా మారిపోతుంది అమె వనితగా రూపు దిద్దుకుని
తాను అమ్మగా మారి తన పిల్లలకు జన్మ నిస్తుంది
వారి ఆలనలో పాలనలో అన్నీ మరిచి జీవిస్తుంది
ఆపద సమయంలో తనో ఆలంబనగా మారి
ఇంటిని కాపాడుకుంటుంది ఆమె వనితగా రూపుదిద్దుకుని
కత్తి పట్టిన వీరనారీమణుల గాధల్లోనూ చిరస్మరణీయం అమె
కలం చేతబూని కావ్య రచనలు చేసిన అక్షర సుమాలలోను అమె
ప్రజారాజ్య పరిపాలనలోను సాటిలేని మేటి అమె
అబలని అలుసు మాని గుర్తించు ఆమెని
పూర్ణత్వాన్ని నింపుకున్న వనితగా ...
బహు రూపాల రూపసి అమె వనిత ...!!


చిన్ని ప్రపంచం ..
చీకటి చెరలో చిక్కిన సూరీడు
ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయి 
ముడుచుకు పోయిన తన కిరణాలను విప్పారిస్తూ ..
ఆ చెరని చేధిస్తున్నాడు జేగురురంగు మొహం వేసుకుని ..
ఆ బాల భానుని ఒడిలోకి తీసుకుంటూ ..
తూరుపమ్మ ఓదారుస్తుంది ఓపికగా..
చిన్ని పంజరం అయినా..
యజమానులు వేసిన దానాను 
పంచుకుని తింటూ..
ఎన్ని గుస గుసలో..
ఎన్నెన్ని ఊసులో ..
ఇతరులకు ఎవరికీ అర్ధం కానివి 
మూడు సంవత్సరాలు 
ఇతర ప్రపంచం ఎరుగవు ఆ జంట పక్షులు 
కాలం ఏ జంటను అయినా విడదియక మానదు ..
పాపం ..
తెలియని జబ్బు చేసి ఓ రోజు 
అలా తన దేహం వదిలి వెళ్ళిపోయింది ఓ పక్షి ..
తన జోడు ఎందుకు పలకటం లేదు 
అన్న అయోమయంలో మరో పక్షి..
హృదయం నీరై ..రోధిస్తుంది..
ఈ దృశ్యం చూసిన ఆ చేయి ..
"వెళ్ళు నేస్తం ..
ఈ ప్రపంచం ఎంతో విశాలమైనది..
వీనీల ఆకాశంలో స్వేచ్చగా విహరించు ..
నీలో దాగిన ఈ భాదను మరచి ..
వింత వింత విచిత్రాలను చూస్తూ ..
నిన్ను నీవు కాపాడు కుంటూ ..
నీ పయనం సాగించు నేస్తం .."
అంటూ ఆ పంజరాన్ని తెరిచి పట్టుకుంది..
ఈ చిన్ని పంజరమే తన మహలు గా ఎంచిన ఆ పక్షి 
ఎటు పోవాలో తోచక ఎగర లేక ఎగురుతుంది...
అదిగో...!!

విడివడిన కురులను లెక్కచేయక..
దారంతా పరుచుకున్న గులకరాళ్ళను ...
అక్కడక్కడా చేరి నిలిచిన ముళ్ళ పొదలను
చూసుకోక రక్తసిక్తమైన పాదాల అడుగులతో ..
నిలువలేని ప్రాణాన్ని చిక్కబట్టు కుంటూ..
పరుగు పరుగున వచ్చి చేరితిరా కృష్ణా...
నీ బాహువులలో బందీగా నిలచిన ఈ క్షణం
ఇలా స్తంబించిపొతే ఎంతబాగుండు..
ఏ చిత్రకారునుని కుంచె నుంచి జాలువారిన చిత్రంలా...
ఏ శిల్పి ఉలితో చెక్కిన శిల్పంలా...
చిరస్తాయిగా..అమరమై నిలిచిపోతే...చాలు కృష్ణా..


ఎన్ని అందాలో 
మన ఆనందాల వెన్నెల్లో..
అవి అన్ని కాలంతో పాటే 
మనకు సొంతమైనాయి 
ముదిమి వయసులోనూ 
ముచ్చటలను తీరుస్తూ..

కన్నులు కమలాలయినవి ..
నీ చూపులే భానుని కిరణాలనుకుని..
. శ్రీ లక్ష్మి ఆసనం కమలమే..
శ్రీనివాసుని ఎదపై చేరి నిలిచినది..
కొలనంతా విరిసిన కమలాలు ..
చుట్టూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ భ్రమరాలు ..
ఎందుకో..
హృదయం అంత సముద్రమై పొంగుతుంది ఎందుకో
మూన్నాళ్ళ ముచ్చటే జీవితమని తెలుపుతుంది ఎందుకో
పూవు పూవు పై వాలుతూ తుమ్మెద
మధువంత తాగి పూవునూ మరుస్తుంది ఎందుకో ..
మావి చిగురు మేసినా గండు కోయిల
కుహు కుహు రావాల పలకకుంది ఎందుకో ..
పున్నమి చంద్రుని వెన్నెలని దోచుకొన్నా గోదారమ్మ
వేదనల ఉప్పెనలతో ఉరుకుతుంది ఎందుకో ..
ఏ మమత కోసమో మూగదైనా మనసు
ఎదురు చూపుల వర్షాన్ని కురిపిస్తుంది ఎందుకో..
శీర్షిక : "రంగస్థలం "
గ్రీష్మ తాపానికి నెర్రెలిడిచిన నేలమ్మ
ఆవిరవుతూ ఆశగా చూసింది నింగివైపు 
ఏ సంతోషమో గాని గగనతలంలో గాలి
ఈవల ఆవల మబ్బులన్నిటిని ఒకటిచేస్తూ .
హోరు హోరున ఈలలు వేస్తుంది..
నాట్యాలు చేసే మేఘాలకి పోటీలెక్కువైనాయేమో
పోట్లాటలకు దిగి భీబత్సవం సృష్టిస్తున్నాయి ..
ఇదే అదునని మెరుపుకన్నెలు అందాలారబోస్తున్నాయి ..
రంగస్థలమైన ఆకాశం నుంచి చప్పట్ల చినుకులు ..
చిటపటమంటూ చేరి ధరణిని ముద్దాడుతున్నాయి..!!
రారాజులము ..
నేలమ్మని నమ్మినాము ..
నింగికేసి చూసినాము ..
కరి మబ్బులు కమ్ముకు రావా..
కానుకగా వర్షపు చినుకలనీయవా..
కష్టానికి నెరవమని
వీస్తున్న ఈ గాలి దొరకి తెలుసు..
సూరీడి తాపానికి తాను ఆవిరై
మా కన్నుల చేరి ..
కన్నీరై పారుతున్నానని ..
ఆ చెరువు తల్లికి తెలుసు...
పచ్చని పైరుల నిండుగ కంకులతో
వచ్చిపోవు పక్షుల పలకరిస్తూ
నందనవమల్లె ఉన్న ఈ భూమికి ..
ఏ కరువు రక్కసి దిష్టి చూపు చూసిందో..
మూడేళ్ళ నుంచి ముక్కలు ముక్కలుగా ఇరిగి
చెలమ తడి కానరాని భీడైనదీ..
ఎదురు చూపులే వేడుకోలుగా ఎంచి..
ఓ వానదేవా...కనికరము చూపుమయ్యా..
ఆలుబిడ్డల అరచేతిల అన్నం ముద్దనుంచు
అదృష్టమునిచ్చి ఆదుకోవయ్యా...
అన్నపూర్ణమ్మ వారసులము మేము
రైతన్నలము ..పంటచేలలో పరవశించు రారాజులము ..!! .
అదిగదిగో చిలుక
ఎగిరి పోతున్నది ఎచటికో
అది గదిగో చిలక
గుండె గూటిలో 
గుబులుగున్నదని
ఎగిరి పోతున్నది చిలక
శ్వాసల చప్పుళ్లకు
బెదిరిపోతూ ...
ఎగిరి పోతున్నది చిలక
మాట్లాడలేని మౌనాలలో
నలిగి పోతూ ...
ఎగిరిపోతున్నది చిలక ..
నశించిన మనిషితనంలో
మలిగిపోతూ ...
ఎగిరి పోతున్నది చిలక ..
రగిలే ద్వేషపు మంటల్లో
మసి అయిపోతూ ..
ఎగిరి పోతున్నది చిలక ..
ఆత్మ అను పేరుతొ
ఆహరహరము అల్లాడుతూ ...
ఎగిరిపోతున్నది చిలక ...
కాయం విడిచిన చిలక
విశ్వంలో పరమాత్మను వెతుకుతూ ...
ఎగిరి పోతున్నది చిలక...
నిజం...నిజం..
నీ తలపుల
కలవరింతల కవుగిలింతలచెరలో...
నే బందీనయ్యానే...
మూత పడని కనులకు నేనొక
ప్రశ్నగా మిగిలానే....
చెలీ ..
.నీ నీడలో దాగిననను
ఒక్కసారి చూపులు సారించి చూడు....
నీ.. నిలువెల్లా...నేనవుతా... నీతోడు....
ప్రణయ కలహమిది ...
పోనీలెమ్మనుకున్నా....
ఎదను తన్నినా ...
సత్య కొంగు విడువనికృష్ణయ్య...
మా గురువన్నా....
చెలీ ...
ఒక్కసారి నువు నా
చెంతకు చేరితే...చాలు...
మన వలపు ప్రమిదెలొ వెలిగే దీపం..
ఆరనివ్వ నెన్నటికీ ... ఇది ..నిజం..నిజం..!!.
నీ ఊహల్లో బందీనీ చేసి..
మేలి ముసుగు పరదాల చాటున 
అందాలను దాస్తూ...
ఎదలోని సందడుల రంగులతో 
చిత్రించావు నన్ను ..
నీ వేలి కోసలలో నాట్యమాడుతూ
రంగులలో మునకలేసే కుంచె
చివరలతో నాకు మెరుగులు దిద్దుతూ
నీవర్పించిన ఆరాధనాంజలులు ..
నన్ను జీవితురాలిని చేసాయి ..
చిత్రపటంలో నిలువలేని నేను ..
నీకే అర్ధం అయిన ఈ సొగసు
పూ మాలికలతో నిన్ను
అభిషేకించాలనీ...
ఆర్తితో తలపుల తలంబ్రాలు పోస్తూ..
నీకై మిగలాలని....
సంగతులకు తెలియని చీర
కుచ్చిళ్ళ బరువును మోస్తూ..
అడుగు బయటకు వేస్తున్నా...
చెలికానివి నీవేనని నమ్ముతూ...!!

సాయి నాధా
సద్గురుదేవ
నీ చరణ ధూళి
సోకిన చాలు
శ్వాసలు నిలుచును 
చిర కాలాలు ..
నీ నివాసమే
షిరిడి గ్రామము
అయినది అదియే
పండరి పురము //సాయి నాధ //
నీటితో వెలిగిన
దీపాలే సాక్షి
మాయలు కావు
మహాత్ముడవు నీవని //సాయి నాధా //
సాయీ అని పిలిచిన చాలు
సమాధి నుండి పలుకుతావు
మనసున నిలిచి మార్గము చూపుతూ
బ్రతుకు బాటకు గమ్య మవుతావు //సాయి నాధా //
పాపం కోకిల
ఆకులు రాలుస్తూ మోడుగా మిగులుతున్న కొమ్మలను చూస్తూ..
గూడు కరువైన కోయిలమ్మ ఎడారైనది బ్రతుకని మూగగా రోదిస్తూ
కాకమ్మ గూటిలో గుడ్లను పెట్టి తానెటో వెళ్ళిపోయింది..
రూపం కురూపి అయినా...గాత్రం కటోరమయినా...
చీ కాకి అని చీదరించుకునే పక్షి అయినా..
తనకున్న మంచి మనసుతో బేదాలను మరచి పొదిగిన గుడ్లలోనుండి.
చిట్టి చిట్టి కోయిల పిల్లలు ..కాకమ్మ పిల్లలతో పాటు కీచు కిచుమంటూ..
అమ్మ కాని అమ్మ కాకమ్మ తెచ్చిన ఆహారం తింటూ పెరుగుతున్నాయి
చిగురులు తొడుగుతున్న మామిడి కొమ్మలపైకి ..
అప్పుడే వస్తున్న రెక్కలతో ఎగురుకుంటూ పోయి
తృప్తిగా మావిచిగురులను తిన్న పిల్ల కోయిల
కుహు..కుహు అంటూ. గానమందుకుంది..
శిశిరాన్ని వెనక్కి నెట్టుతూ వసంతుడు పరుగు పరుగున వస్తున్నాడు ..
ప్రచండ భానుడి తాపం పెరిగి..కాలం ఎండాకాలంలోకి వెళ్ళింది.,
మూడు కాలాలు ..ఆరు ఋతువులు..పన్నెండు నెలలు ..ఒక ఏడాది ..
చక్రబ్రమణంలో మార్పు లేదు..విశ్వంలో మార్పు లేదు..కానీ..
మనిషి మనుగడ సాగించే విదానంలో జరిగే మార్పులకి ..
పక్షి జాతి బలి అవుతూ..అంతరించి పోతుంది . ..
మధురమైన గాత్రంతో మనలను సన్మోహితులను చేసే కోయిలలు ..
అడవుల స్తానంలో వెలిసిన కాంక్రీట్ భవనాలలో గూళ్ళు పెట్టుకోలేక
“కోకిల “ ఇదే అంటూ కంప్యుటర్ లో కనిపించే బొమ్మలుగా మిగిలిపోతున్నాయి..!!
పల్లకి మోసేందుకయినా...
పాడె మోసేందుకయినా...
కావలి నలుగురు మనుషులు...
పల్లకిలో జీవం ఉంటుంది...
పాడె లో...నిర్జీవం ఉంటుంది...
జీవితం అంతే...కదూ...
నలుగురితో సఖ్యంగా ఉంటేనే..
జీవితం జీవిస్తుంది..
స్వార్ధబుద్దితో గెలిచే ఒంటరితనం..
మృత జివితో సమానం కదూ...!!


ప్రాణాధారాలు ..
గాలిలో తేలుతూ ...
వచ్చినేలపై పడిన ఓ విత్తనం 
మొలకెత్తి పదిమందికి నీడని ఇచ్చే 
మహా వృక్షంమై నిలవాలంటే..
తగినంత సూర్యరశ్మి ..
నీరు ..ఎంత అవసరమో ..
జన్మించే శిశువుకు ..
ఉత్తమమైన పౌరుడిగా ఎదగడానికి .
అమ్మానాన్నా..తాత నానమ్మా ల 
ప్రేమా ఆత్మీయతల అమృతపు జల్లులే 
అవసరమైన ప్రాణాధారాలవుతాయి..!!
నేలరాలు పూవులు ..
అమ్మ గర్బం నుంచి పేగు తెంచుకుని జారిన బిడ్డవలె ..
కొమ్మ నుండి వీడి నేలరాలు పూవులు ..
బిడ్డ తిరిగి అమ్మ గర్బంలోనికి వెళ్ళగలడా...
రాలి పడిన పూవు మరల కొమ్మకు అతుక్కోగలదా...
అమ్మ అయినా ...కొమ్మ అయినా..అమ్మ తనాన్ని అందించేవే ..
బంధం నిలుపుకోవలసినది నూరేళ్ళ జీవితానికి ముడిపడి ఉన్నది..
నేలను చీల్చుకుని మొలకెత్తిన విత్తనం ...
కొమ్మలుగా విస్తరించి రంగురంగుల పూలను పూయించి ..
సోయగాలతోనూ ..సుగంధాలతోనూ ...
చూసేవారి కనులకు ఆనందాలను ..
మనసుతో మైమరిచే వారికి ఆహ్లాదాన్ని అందించిన పూవులను
తిరిగి నేలతల్లి ఒడి చేరుస్తూ ..తృప్తి చెందుతుంది కాబోలు ...
ఎన్ని పూవులు రాలిపోతున్నా .. ఆ మొక్క మళ్ళి మళ్ళి పుష్పిస్తునే ఉంటుంది ..
ఆయుష్షు తక్కువయినా..అర్పించే తత్వం కలిగినవి పూవులు ..
అందుకే పూజా సామాగ్రిలో అగ్రస్తానాన్ని ఆక్రమించాయి..
తాము లేనిదే అలంకారము లేదు అన్న ధీమా కధూ పూవులది..
నేల రాలినా ఆ క్షణం....వాడని రాజసం ...వీడని పరిమళం ..
పూవులకు మాత్రమే సొంతమై ఉన్నది...
ఆత్మను వీడిన మనిషి శరీరం మాత్రం ..
చితిని చేరే పనికిరాని శవమై మిగులుతుంది..
మంచితనపు సుగంధంతో మనిషితనం విరబూస్తే...
కృష్ణుని సేవకు చేరిన నేలరాలిన పారిజాతమల్లే ..
అమరమై జీవితం ...తర తరాలకు ఆదర్శమయి నిలుస్తుంది..!!.
LikeShow More Reactions
Comment