17, ఫిబ్రవరి 2015, మంగళవారం

    సారంగ రాగమంటి వెన్నెల
    సాక్షిగా ..విన్నవించుకొను నా వేదనలకు
    సారాంశమే తెలియని పద్యం వలెనున్నజీవితాన్ని
    సాభిప్రాయంగా నివేదిస్తూ,
    ...
    సాష్టాంగనమస్కారం చేస్తూ..
    సాయి దేవుని..వేడుకుంటున్నా ...వారి
    సాన్నిధ్యము దూరం చేయక ..
    సాకతము నిచ్చు ప్రభువని తలచి..
    సాన్నిధ్యమునెన్నడు వీడక
    సాకారము చేసుకొందు బ్రతుకు..
    సాత్వికమగు బాబాగారి సుక్తులననుసరిస్తూ...
    సాటి జనుల సేవలో తరిస్తూ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి