17, ఫిబ్రవరి 2015, మంగళవారం

    చివరాఖరుకు...
    తూర్పు పడమరల కలయికలలో
    తొలిసంధ్య మలిసంధ్యల మధ్య నిలిచిన దూరం .
    .బ్రతుకు గమనంలో ప్రయాణం ...
    ప్రయాస అయినా..గమ్యం చేరాలనే తాపత్రయం..

    గెలుపుల విజయలయినా..
    ఓటముల సంఘర్షణ లయినా ..
    చివరాఖరుకు ఆరడుగుల నేలకై..
    జీవితం.. అంతిమం వరకు..బ్రతుకు పోరాటమే..
    జన్మనిచ్చిన అమ్మ ఒడి
    సాంత్వనల అమృతం పంచు గుడే ఎన్నటికి....
    అయితే...మహాప్రస్థాన ఘట్టంలో జీవుడు..సమాధి స్థితిలో
    జనని మట్టిరేణువుల కరిగి....సజీవుడుగానే మిగులుతాడు...!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి