29, సెప్టెంబర్ 2015, మంగళవారం

‘ సాక్ష్యం’
చూపులు సారించి మబ్బులకేసి
ఆశగా చూసే రైతన్నలకు జీవాన్నిఇస్తూ..
చిటపట మని కురిసే తొలకరి చినుకులు..
గ్రీష్మ తాపానికి వేడెక్కిన నేలతల్లి
గుండెలోనికి జారిన ఆ చినుకులదారలు ..
,మట్టి రేణువుల సంగమంలో జనించిన సుగంధాలను..
వీచే గాలి తెమ్మెరలు ఆలింగనం చేసుకొని..
మోసుకు తిరుగుతున్నాయి...
ఆ పరిమళాల ఆస్వాదనలో..జగతి పులకించి..
ఒళ్ళు విరుచుకుంటుంది..
తొలకరి జల్లుల తడి చీరెను సవరించు కుంటూ..!
తమకంతో నలుపెక్కుతున్న మేఘుడు..
సప్త వర్ణాలవంతెనపై..
మెరుపుల రాయబారం పంపుతూ..
ఉరుముల సందేశాన్ని ఇస్తూ..
తన ప్రేమని చాటుకుంటున్నాడు...
జడివానగా తాను మారిపోతూ..
వానాకాలపు సరాగాల సైయ్యటలకు
ఈ ' తొలకరి జల్లులే ' సాక్ష్యం అని చెపుతూ....!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి